SA vs IND: ఇండియా, సౌతాఫ్రికా తొలి టెస్టుకు టికెట్స్ సోల్డ్ ఔట్.. కన్ఫర్మ్ చేసిన సౌరవ్ గంగూలీ

SA vs IND: ఇండియా, సౌతాఫ్రికా తొలి టెస్టుకు టికెట్స్ సోల్డ్ ఔట్.. కన్ఫర్మ్ చేసిన సౌరవ్ గంగూలీ

ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య నవంబర్ 14 నుంచి ప్రారంభం కానున్న తొలి టెస్టుకు భారీ హైప్ నెలకొంది. ఈ క్రేజీ టెస్ట్ మ్యాచ్ చూసేందుకు ఫ్యాన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలిచిన సౌతాఫ్రికాపై సిరీస్ కావడమే ఇందుకు కారణం. ఐకానిక్ స్టేడియం కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో జరగబోయే ఈ టెస్ట్ మ్యాచ్ కు టికెట్స్ అన్ని అమ్ముడుపోయాయి. మరో నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ టికెట్స్ అన్ని సోల్డ్ ఔట్ కావడం విశేషం. ఇండియా, సౌతాఫ్రికా జట్ల మధ్య జరగబోయే తొలి టెస్టుకు టికెట్స్ అన్ని సోల్డ్ ఔట్ అయినట్టు టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ధృవీకరించారు. 

ఇండియా, సౌతాఫ్రికా టెస్ట్ మ్యాచ్ టిక్కెట్ల అమ్మకం సోమవారం (అక్టోబర్ 20) మధ్యాహ్నం 12 గంటల నుండి ప్రారంభమైంది.  టికెట్ ధర కేవలం రూ. 60 మాత్రమే కావడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. స్టార్టింగ్ ధర రూ.60 నుంచి ప్రారంభమవవుతుంది. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ ను రూ.300తో చూడవచ్చు. అత్యధికంగా టికెట్ ధర రూ. 250 వరకు ఉంటుంది. తక్కువ రేట్ కావడంతో ఫ్యాన్స్ డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ ద్వారా టిక్కెట్లను వేగంగా బుక్ చేసుకున్నారు. నవంబర్ 14 నుంచి 18 వరకు ప్రస్తుత ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌లో భాగంగా సఫారీలతో టీమిండియా తొలి టెస్టులో తలపడుతుంది. 2019లో ఇండియా- బంగ్లాదేశ్ పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ తర్వాత ఈడెన్‌లో జరగబోయే తొలి టెస్ట్ ఇదే కావడం గమనార్హం.    

WTCలో మూడో స్థానంలోనే ఇండియా: 

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27లో భాగంగా లేటేస్ట్ పాయింట్స్ టేబుల్ లో ఇండియా మూడో స్థానంలోనే ఉంది. ఇంగ్లాండ్ తో ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-2 తో సమం చేసుకొని మూడో స్థానంలో నిలిచిన టీమిండియా.. తాజాగా వెస్టిండీస్ పై రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 2-0తో క్లీన్ స్వీప్ చేసినా మూడో స్థానంలోనే కొనసాగుతుంది. మంగళవారం (అక్టోబర్ 14) ఢిల్లీ వేదికగా ముగిసిన రెండో టెస్టులో టీమిండియా విజయం సాధించిన తర్వాత పాయింట్ల శాతం (PCT) 55.56 నుండి 61.90కి పెరిగింది. పాయింట్ల శాతాన్ని పెంచుకోగలిగినప్పటికీ టాప్-2 లోకి రాలేకపోయింది.  

►ALSO READ | IPL 2026 Trade: చెన్నైకి చెక్ పెట్టిన గుజరాత్.. స్టార్ ఆల్ రౌండర్‌ను పంపేది లేదంటూ క్లారిటీ!

ఇండియా ఇప్పటివరకు డబ్ల్యూటీసిలో ఏడు టెస్ట్ మ్యాచ్ లాడింది. వీటిలో నాలుగు గెలిచి రెండు మ్యాచ్ ల్లో ఓడిపోయింది. ఓవరాల్ గా 52 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుంది. స్వదేశంలో నవంబర్ నెలల్లో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ సిరీస్ లో ఇండియా గెలిస్తే టాప్-2కు చేరుతుంది. తొలి స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ పై యాషెస్ లో ఓడిపోతే ఇండియా టాప్ కు చేరుకునే ఛాన్స్ ఉంటుంది.