పెన్షనర్లకు డీఏ బకాయిలు రిలీజ్ చేయాలి : వెంకటరామారావు

పెన్షనర్లకు డీఏ బకాయిలు రిలీజ్ చేయాలి : వెంకటరామారావు

కరీంనగర్ టౌన్, వెలుగు: కరోనా సమయంలో కేంద్ర పెన్షనర్లకు నిలిపివేసిన 36 ఇన్ స్టాల్ మెంట్ల డీఏలను ఇంతవరకు విడుదల చేయకపోయడం బాధాకరమని తెలంగాణ రాష్ట్ర పోస్టల్, ఆర్ఎంఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చెన్నమనేని వెంకట రామారావు మండిపడ్డారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా పోస్టల్, ఆర్ఎంసెస్ పెన్షనర్లు అసోసియేషన్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 18 నెలలకు సంబంధించి 36 ఇన్స్టాల్మెంట్స్ డీఏలు ఇవ్వాలన్నారు. 

సీనియర్ సిటిజన్స్ కు  రైల్వే టికెట్స్ కాన్సెషన్ రద్దు చేసి ఇంతవరకు పునరుద్దరణ చేయలేదని విమర్శించారు. దేశ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉండి జీఎస్టీ కలెక్షన్ రికార్డు సాధించిన కూడా న్యాయంగా ఇవ్వాల్సిన డీఏలను ఎందుకు విడుదల చేయడం లేదని ప్రశ్నించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఎం.లక్ష్మిపతి, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉప్పల రామేశం, కార్యదర్శి ఎం. రాజయ్య, కోశాధికారి వై.చంద్రమౌళి పాల్గొన్నారు. నూతన కార్యదర్శి గా కొండపాక చంద్రమోహన్ రావు ఎన్నికయ్యారు.