రేపటి నుంచి హైదరాబాద్​లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్​

రేపటి నుంచి హైదరాబాద్​లో పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్​

హైదరాబాద్, వెలుగు: ఇండియన్ పౌల్ట్రీ ఎక్విప్​మెంట్​ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఈ నెల 22 నుంచి 24 వరకు పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్​లోని హైటెక్స్​లో ఈ కార్యక్రమం జరుగుతుంది. పౌల్ట్రీ  ఫీడ్ పరికరాలు, టెక్నాలజీలు,  గుడ్ల పెంపకం,  కోళ్ల ఆరోగ్యం, అంతర్జాతీయ ఉత్పత్తులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ కార్యక్రమం అందిస్తుంది. పరిశోధన, సైన్స్, టెక్నాలజీలో తాజా పురోగతిని కూడా తెలియజేస్తుంది.  సైంటిఫిక్ ఫోరమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను నిర్వహించడమేగాక పౌల్ట్రీ పరిశ్రమలో కెరీర్ అవకాశాలను కూడా తెలియజేస్తారు. మనదేశం నుంచి రికార్డు స్థాయిలో 380 కంపెనీలు,  విదేశాల నుంచి 45 కంపెనీలు ఈ ఎగ్జిబిషన్​లో పాల్గొంటాయి.  

మూడు రోజుల్లో 30 వేల మంది బిజినెస్​ విజిటర్లు వస్తారని అంచనా.  పలుదేశాల నుంచి 1,500 మందికిపైగా ప్రతినిధులు  సంతానోత్పత్తి, పరిశుభ్రత, పోషకాహారం, జంతువుల ఆరోగ్యం, పౌల్ట్రీ పరికరాలు గురించి మాట్లాడుతారు.   భారతీయ పౌల్ట్రీ రంగం 25 వేల మందికి పైగా లేయర్​ రైతులకు,  10 లక్షల బ్రాయిలర్ రైతులకు ఉపాధిని కల్పిస్తోందని అసోసియేషన్​ ప్రెసిడెంట్​ ఉదయ్ సింగ్ బయాస్ అన్నారు. హైదరాబాద్​లో గత పదిహేను సంవత్సరాలుగా  ఫౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.    నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (ఎన్​ఐఎన్​) ప్రకారం ఇండియాలో తలసరి గుడ్ల వినియోగం 180 కాగా, కోడి మాంసం తొమ్మిది కిలోలు ఉంది. భారతదేశం గుడ్ల ఉత్పత్తిలో ప్రపంచంలో రెండో స్థానంలో, కోడి మాంసం ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది.