
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ జంటగా వచ్చిన భారీ మైథలాజికల్ మూవీ ఆదిపురుష్. బాలీవుడ్ దర్శకుడు ఔం రౌత్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. రామాయణం గాధ ఆధారంగా రూపొందిన ఈ మూవీ.. జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమాకు మొదటి షో నుండే మిక్సుడ్ టాక్ వచ్చింది. అయినా కూడా తొలిరోజూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది.
ఇక కలెక్షన్స్ తోపాటు ఈ చిత్రంలోని పాత్రలు, డైలాగ్స్పై అదే స్థాయిలో విమర్శలు కూడా వచ్చాయి. దేశవ్యాప్తంగా సినిమాను నిలిపివేయాలంటూ నిరసనలు కూడా జరిగాయి. దీంతో మేకర్స్ తమ తప్పులను అంగీకరించి.. అభ్యంతరకరమైన డైలాగ్స్ మార్చేశారు.
ఇక తాజాగా ఆదిపురుష్ మేకర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు తొలి మూడు రోజులు కలెక్షన్స్ బానే ఉన్నా.. ఐదో రోజుకు వచ్చేసరికి భారీస్థాయిలో పడిపోయాయి. దీంతో ప్రేక్షకుల కోసం ఆదిపురుష్ మేకర్స్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. సినిమా టికెట్ల ధరను భారీగా తగ్గించారు. ఈ సినిమాను త్రీడీలో చూసేందుకు కేవలం రూ.150 లకే టికెట్స్ అందుబాటులో ఉంటాయని ప్రకటన విడుదల చేశారు. 3D గ్లాస్ ఛార్జీలు అదనంగా ఉంటాయని తెలిపారు. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడులో మాత్రం ఈ ఆఫర్ చెల్లదని ప్రకటనలో తెలిపారు.