Kannappa Movie : థియేటర్ల దగ్గర ప్రభాస్ కన్నప్ప కటౌట్ల సందడి

Kannappa Movie : థియేటర్ల దగ్గర ప్రభాస్ కన్నప్ప కటౌట్ల సందడి

కన్నప్ప మూవీ శుక్రవారం (జూన్27న) థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. ఈ మూవీలో మంచు విష్ణుతో పాటు ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి బిగ్ స్టార్స్ నటించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీకి ఆడియన్స్ నుంచి మంచి బజ్ వినిపిస్తోంది. విడుదల ఇంకా 2 రోజులే ఉండటంతో ఆ హైప్ క్రమంగా పెరుగుతోంది. 

ముఖ్యంగా ప్రభాస్ రాక కోసం తమ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కన్నప్పలో ‘రుద్ర’ అనే సాధువు పాత్రలో ప్రభాస్ నటించాడు. టీజర్, ట్రైలర్ విజువల్స్లో తన పెర్ఫార్మన్స్తో మూవీకి భారీ హైప్ క్రియేట్ చేశాడు. 

లేటెస్ట్గా డార్లింగ్ ఫ్యాన్స్.. ప్రభాస్పై ఉన్న తమ అభిమానాన్ని చాటుకునేందుకు డిసైడ్ అయ్యారు. వైజాగ్‌లోని ప్రభాస్ ఫ్యాన్స్.. కిన్నెర కామేశ్వరి థియేటర్‌లో 40 అడుగుల భారీ కటౌట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కటౌట్‌ను సినిమా విడుదలకు ముందే ఆవిష్కరించనున్నారు. ఇవాళ సాయంత్రం లేదా.. జూన్ 26న మార్నింగ్.. ఈ కటౌట్ను లాంచ్ చేయనున్నారు. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్ల దగ్గర రుద్ర కటౌట్ల సందడి నెలకొంది. విష్ణు కన్నప్ప పోస్టర్స్ కంటే, ప్రభాస్ రుద్ర పోస్టర్స్ ఉండటం కనిపిస్తుంది. దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. వెండితెరపై ప్రభాస్ దర్శనం కోసం ఫ్యాన్స్ ఎలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారనేది.!

గతంలో ప్రభాస్ అభిమానులు అతని పుట్టినరోజు సందర్భంగా 230 అడుగుల భారీ కటౌట్ను ఏర్పాటు చేశారు. ఇది హైదరాబాద్ లోని కూకట్‌పల్లి ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఇది దేశంలోనే అతి పెద్ద ప్రభాస్ కటౌట్‌గా నిలిచింది. సలార్ రిలీజ్కు ముందు ఇది ఏర్పాటు చేశారు. అలాగే, ఆదిపురుష్ రిలీజ్ టైంలో కూడా  50 ఫీట్స్ క‌టౌట్‌ను ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సుద‌ర్శ‌న్ థియేట‌ర్ వ‌ద్ద ఆవిష్కరించారు. 

ఇదిలా ఉంటే .. కన్నప్ప మూవీలో విష్ణు తిన్నడు పాత్ర పోషించనున్నారు. తల్లీతండ్రి తప్ప మరో దైవం లేరని చెప్పేవాడు తిన్నడు. ఆ తిన్నడు సినిమా గమనాన్ని మార్చే కీలక పాత్ర ‘రుద్ర’క్యారెక్టర్లో ప్రభాస్ నటించడం మూవీ అతిపెద్ద హైలైట్లలో ఒకటి. ఇందులో ప్రభాస్ స్క్రీన్‍టైమ్ సుమారు 30 నిమిషాలు ఉండనుంది. మరి ప్రభాస్ ఆగమనం ఎలా ఉంటుందో చూడాలి.

ఇకపోతే ఇవాళ సాయంత్రం (జూన్ 25) తెలుగు అడ్వాన్స్ బుకింగ్స్ షురూ కానున్నాయి. ఈ విషయాన్ని విష్ణు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.  ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీలో మహాశివుడిగా అక్షయ్ కుమార్, పార్వతిదేవిగా కాజల్ అగర్వాల్ నటించారు.