
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ సైన్స్ ఫిక్షన్ మూవీ రూపొందుతోంది. ‘ప్రాజెక్ట్ కె’ వర్కింగ్ టైటిల్తో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు. ఇప్పటికే డెబ్బై శాతం షూటింగ్ పూర్తయింది. ఈనెల 27 నుండి కొత్త షెడ్యూల్ మొదలవబోతున్నట్టు తెలుస్తోంది. నిర్మాత అశ్వనీదత్ ఈ సినిమా గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఇంటరెస్టింగ్ విషయాలు చెప్పారు. గత ఐదు నెలలుగా యూఎస్ఎ, సౌత్ ఆఫ్రికాతో పాటు వరల్డ్వైడ్గా పలుచోట్ల గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోందట. సినిమాకెంతో కీలకమైన అమితాబ్, దీపికా పదుకొణె పాత్రలకు సంబంధించి మరో పదిరోజుల షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందట. దిశాపటానితో పాటు చాలామంది యాక్టర్స్ ఇందులో కనిపించబోతున్నారు. ఫ్యాంటసీ మూవీ అయినప్పటికీ సెంటిమెంట్, ఎమోషన్స్కు ప్రాధాన్యత ఎక్కువని అశ్వనీదత్ చెప్పారు. ఇందులో ప్రతిదీ కొత్తగా ఉండబోతోందని, సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నామని ఆయన అన్నారు. అంతేకాదు.. గతంలో మ్యూజిక్ డైరెక్టర్గా మిక్కీ జే మేయర్ పేరును ప్రకటించారు. అయితే ఇప్పుడా స్థానంలో కీలకమార్పు జరిగింది. సంతోష్ నారాయణ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ అసలు టైటిల్ను మార్చిలో రివీల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది.