ఆరోగ్యం కోసం ప్రతి రోజూ వ్యాయం తప్పనిసరిగా చేయాలని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు అన్నారు. ప్రజా పాలన– ప్రగతి ప్రణాళికలో భాగంగా సోమవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో 2, 5 కే రన్కార్యక్రమాలు నిర్వహించారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన 2 కేరన్ను కలెక్టర్ సందీప్కుమార్ఝా, వరంగల్లోని కాశీబుగ్గలో కలెక్టర్ సత్యశారద.., జయశంకర్భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్వహించిన 5 కే రన్ను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు జెండా ఊపి ప్రారంభించారు.
టేకులపల్లిలో నిర్వహించిన 2 కే రన్ను ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు ప్రారంభించగా, జూలూరుపాడులో స్థానిక యువకులు, ఆఫీసర్లు, నాయకులు ప్రోగ్రామ్లో పాల్గొన్నారు. అశ్వారావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ 2 కేరన్ను ప్రారంభించారు.
వెలుగు, నెట్వర్క్
