హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్

హీరో సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పిన ప్రకాష్ రాజ్

నటుడు ప్రకాష్ రాజ్ కర్ణాటక ప్రజల తరపున హీరో  సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పారు.  కావేరి జలవివాదం నేపథ్యంలో కర్ణాటకలో నిరసనకారులు హీరో  సిద్ధార్థ్ మీడియా సమావేశాన్ని అడ్డుకోవడంపై ప్రకాష్  రాజ్ స్పందించారు.   " దశాబ్దాలుగా ఈ సమస్యను పరిష్కరించలేని అసమర్థ రాజకీయ పార్టీలన్నీ.. నేతలను ప్రశ్నించకుండా.. నిస్సహాయులైన సామాన్యులను..కళాకారులను అడ్డుకోవడం సరికాదు.  కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావలని ఎంపీలను ప్రశ్నించండి. కన్నడ పౌరుడిగా, కర్ణాటక ప్రజల తరపున  నేను నీకు  క్షమాపణలు చెబుతున్నా  సిద్ధార్థ్‌"  అంటూ ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు.  

 

ఇంతకీ ఏం జరిగింది

సిద్ధార్థ్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘చిన్నా’.  ఈ సినిమా గురువారం విడుదలైంది. ఈ క్రమంలో  కర్ణాటకలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సిద్ధార్థ్‌ పాల్గొన్నారు. అయితే  కార్యక్రమం మొదలు కాగానే కొందరు నిరసన కారులు అక్కడికి చేరుకుని ప్రెస్‌మీట్‌ ఆపేయాలని సిద్ధార్థ్‌కు సూచించారు. లేదంటే కావేరి ఉద్యమానికి మద్దతు తెలపాలని సిద్ధార్థ్‌ను కోరారు . నదీ జలాల విషయంలో వివాదం నెలకొన్న తరుణంలో తమ ప్రాంతంలో ప్రెస్‌మీట్‌ నిర్వహించడంపై వారు అసహనం వ్యక్తం చేశారు. సమావేశాన్ని నిలిపివేసి.. అక్కడి నుంచి వెళ్లిపోవాలని తెలిపారు.  దీంతో  సిద్ధార్థ్‌ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.