మూడు సినిమాలు ఒకేసారి

మూడు సినిమాలు ఒకేసారి

రెడ్డీస్ మల్టీప్లెక్స్ మూవీస్ బ్యానర్ స్టార్ట్ చేసిన విజయ్ రెడ్డి.. ఒకేసారి మూడు సినిమాలను ప్రారంభించారు. ‘సోషల్ వర్కర్స్’ టైటిల్‌‌తో తెరకెక్కుతోన్న సినిమాతో ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఫిమేల్ ఓరియెంటెడ్‌‌గా రూపొందుతోన్న చిత్రంలో ఎనిమిది మంది హీరోయిన్లు లీడ్ రోల్స్ చేస్తున్నారు. మహేందర్ రెడ్డిని డైరెక్టర్‌‌‌‌గా పరిచయం చేస్తూ.. ‘కోబలి’ చిత్రాన్ని మొదలుపెట్టారు. ఇందులో మిత్ర ప్రధాన పాత్రధారి. వీటితోపాటు ‘హ్యాపీ విమెన్స్‌‌ డే’ టైటిల్‌‌తో మరో మూవీని ప్రకటించారు. సోమవారం రామానాయుడు 
స్టూడియోస్‌‌లో పూజా కార్యక్రమాలతో ఈ చిత్రాలను ప్రారంభించారు. బాబు మోహన్ ముఖ్య అతిథిగా హాజరై క్లాప్ కొట్టి విజయ్ రెడ్డికి ఆల్ ద బెస్ట్ చెప్పారు.