2 రాష్ట్రాల్లో పీకేకు ఓటు..! నోటీసులు జారీ చేసిన ఈసీ

2 రాష్ట్రాల్లో పీకేకు ఓటు..! నోటీసులు జారీ చేసిన ఈసీ

పాట్నా/కోల్‌‌కతా: జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్‎కు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఆయన తన సొంత రాష్ట్రం బిహార్‌‌తో పాటు పక్కనే ఉన్న బెంగాల్‌‌లో కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు. దీంతో అతనికి బిహార్‌‌లోని రోహ్​తాస్‌‌లో గల జిల్లా ఎన్నికల కార్యాలయం నోటీసు జారీ చేసింది. మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది. 

ప్రశాంత్ కిశోర్ బిహార్‎లోని కార్గహర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటరుగా నమోదు చేసుకున్నారు. అలాగే, బెంగాల్‌‌లో ఆ రాష్ట్ర సీఎం, టీఎంసీ చీఫ్​ మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న కోల్‌‌కతాలోని భబానీపూర్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ప్రశాంత్ కిశోర్‏కు ఓటు హక్కు ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం చిరునామా 121, కాళీఘాట్ రోడ్‌‌లో ఓటరుగా నమోదు చేసుకున్నారని బెంగాల్ ఎన్నికల అధికారి ఒకరు తెలిపారు.