ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 81 స్కూళ్లలో  ప్రీప్రైమరీ క్లాసులు ప్రారంభం 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 81 స్కూళ్లలో  ప్రీప్రైమరీ క్లాసులు ప్రారంభం 

కరీంనగర్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్ జిల్లావ్యాప్తంగా 81 ప్రైమరీ స్కూళ్లలో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం ప్రభుత్వ స్కూళ్లలో ఒకటో తరగతి నుంచి చదువుకునే అవకాశం మాత్రమే ఉన్న విషయం తెలిసిందే. కానీ చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలకు మూడేళ్ల వయసు నిండగానే  ఎల్ కేజీ, యూకేజీ, నర్సరీ కోసం ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తగ్గుతోంది. 

అందుకే ప్రభుత్వం సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ విద్యను ప్రారంభించింది. కరీంనగర్ జిల్లాలో మూడు స్కూళ్లు, జగిత్యాల జిల్లాలో 32, పెద్దపల్లి జిల్లాలో 46 స్కూళ్లలో ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. మిగతా స్కూళ్లలోనూ దశలవారీగా ప్రీప్రైమరీ చదువును అమలు చేయనున్నారు.