హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంపెనీ ప్రీమియర్ ఎనర్జీస్ ఫొటోవోల్టెయిక్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ ఆర్డరు అందుకుంది. అమర రాజా ఇన్ఫ్రా బంగ్లాదేశ్లో చేపట్టిన ఈపీసీ (ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్) ప్రాజెక్టుకు సంబంధించి 140 మెగావాట్ల (ఎండబ్ల్యూ) సోలార్ పీవీ మాడ్యూల్స్ను ఈ కంపెనీ సరఫరా చేయనుంది.
2025 ఏప్రిల్ నాటికి సరఫరా పూర్తవుతుందని అంచనా. ‘ప్రీమియర్ ఎనర్జీస్ గ్రూప్నకు ఇదొక పెద్ద మైలురాయి. మా సోలార్ పీవీ మాడ్యూల్స్ క్వాలిటీ, పనితీరు, విశ్వసనీయతకు ఇది నిదర్శనం’ అని కంపెనీ ఎండీ చిరంజీవ్ సలూజా ఈ సందర్భంగా అన్నారు.