టాలన్స్‌‌కు ఏడో విక్టరీ

టాలన్స్‌‌కు ఏడో విక్టరీ

జైపూర్‌‌: ప్రీమియర్ హ్యాండ్‌‌బాల్‌‌ లీగ్‌‌ (పీహెచ్‌‌ఎల్‌‌) గ్రూప్‌‌ దశను  తెలుగు టాలన్స్‌‌ మరో విజయంతో ముగించింది. బుధవారం జైపూర్‌‌లో జరిగిన మ్యాచ్‌‌లో టాలన్స్​ 36–-28తో  గార్విట్‌‌ గుజరాత్‌‌ను ఓడించింది. తెలుగు టీమ్​లో నసీబ్‌‌ సింగ్‌‌ (8), కైలాష్‌‌ పటేల్‌‌ (7), దేవిందర్‌‌  (6), రాహుల్‌‌ (5) రాణించారు. ఓవరాల్​గా లీగ్​దశలోపది మ్యాచ్‌‌ల్లో ఏడో విజయం సాధించిన తెలుగు టాలన్స్‌‌ పాయింట్ల పట్టికలో టాప్‌‌ ప్లేస్‌‌తో సెమీస్‌‌కు రెడీ అయింది.