
జైపూర్: ప్రీమియర్ హ్యాండ్బాల్ లీగ్ (పీహెచ్ఎల్) గ్రూప్ దశను తెలుగు టాలన్స్ మరో విజయంతో ముగించింది. బుధవారం జైపూర్లో జరిగిన మ్యాచ్లో టాలన్స్ 36–-28తో గార్విట్ గుజరాత్ను ఓడించింది. తెలుగు టీమ్లో నసీబ్ సింగ్ (8), కైలాష్ పటేల్ (7), దేవిందర్ (6), రాహుల్ (5) రాణించారు. ఓవరాల్గా లీగ్దశలోపది మ్యాచ్ల్లో ఏడో విజయం సాధించిన తెలుగు టాలన్స్ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్తో సెమీస్కు రెడీ అయింది.