అల్లూరి సీతారామ రాజు 125 వ జయంతి ముగింపు ఉత్సవాలలో భాగంగా గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
Also Read : వెల్కటూరులో కాకతీయుల కాలం నాటి.. మరకమ్మ విగ్రహం
ఆమెకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, హోం మంత్రి మహమూద్ అలీ, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, మేయర్ గద్వాల విజయలక్ష్మీ, సీఎస్ శాంతకుమారి తదితరులు పుష్ప గుచ్ఛం ఇచ్చి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆమె నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి బయల్దేరారు.