మాస్కో: రష్యాపై దాడి చేస్తే పరిణామాలు ఇలాగే ఉంటాయని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్పై మిసైళ్ల వర్షం కురిపించిన తర్వాత సెక్యురిటీ కౌన్సిల్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. ‘‘క్రిమియా బ్రిడ్జిని టెర్రరిస్టులు బ్లాస్ట్ చేశారు. దీని వెనుక ఉక్రెయిన్ ప్రత్యేక దళాల హస్తం ఉంది. రష్యాపై ఇట్ల దాడులు చేస్తే అస్సలు వదిలిపెట్టం. ఇంతకంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఊహకు కూడా అందని విధంగా దాడులు చేస్తాం. ఇందులో ఎలాంటి సందేహం లేదు” అని పుతిన్ వార్నింగ్ ఇచ్చారు.
ఉక్రెయిన్ బార్డర్ నుంచి 85 కిలోమీటర్ల దూరంలోని రష్యాలోని కుర్స్క్ న్యూక్లియర్ ప్లాంట్పై ఉక్రెయిన్ మూడు సార్లు దాడులు చేసిందన్నారు. నల్లసముద్రంలో రష్యా నుంచి టర్కీ వెళ్లే టార్క్ గ్యాస్ పైప్లైన్ను పేల్చేందుకు
ప్రయత్నించిందని పుతిన్ ఆరోపించారు.