మరిన్ని పొదుపుచర్యలు పాటించాలని నిర్ణయం
ప్రభుత్వానికి సాయపడాలన్నదే ఉద్దేశం
న్యూఢిల్లీ : రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ తన జీతాన్ని 30 శాతం తగ్గించుకోవాలని నిర్ణయించుకున్నారు. వీటితోపాటు మరికొన్ని పొదుపుచర్యల్ని కూడా పాటించాలని నిర్ణయించుకున్నారు. కరోనా మహమ్మారిపై పోరులో భాగంగా ప్రభుత్వానికి సాయపడలన్న ఉద్దేశంతోనే రాంనాథ్ కోవింద్ ఈ నిర్ణయం తీసుకున్నారని రాష్ట్రపతి భవన్ వర్గాలు గురువారం ప్రకటనను రిలీజ్ చేశాయి. ఖర్చులు, ఫిజికల్ డిస్టెన్స్ ను దృష్టిలో ఉంచుకుని టూర్లు, ప్రోగ్రామ్స్ కూడా ఆయన తగ్గించుకోనున్నారు.
ఎట్హోమ్, ఇతర అధికార కార్యక్రమాలను కూడా బాగా తగ్గించుకోవడమేకాదు.. వీటికి తక్కువ మంది గెస్టులను కూడా పిలవాలని నిర్ణయించుకున్నారు. దీనివల్ల ఫుడ్ మెనూ తగ్గడంతోపాటు, పూలు, ఇతర డెకరేటివ్ వస్తువుల వినియోగం కూడా తగ్గనుందని రాష్ట్రపతి భవన్ వర్గాలు చెప్పాయి. ఖర్చును తగ్గించుకోవడంలో అందరికీ ఆదర్శంగా నిలవాలని రాష్ట్రపతి భవన్ వర్గాలకు రాష్ట్రపతి ఆదేశాలు ఇచ్చారు. పోయిన నెలలో తన శాలరీని పీఎం కేర్స్ ఫండ్కు రాష్ట్రపతి విరాళంగా ఇచ్చారు.
ఇతర నిర్ణయాలు
అవసరం మేరకు మాత్రమే రాష్ట్రపతి భవన్ మరమ్మతు, మెయింటినెన్స్ పనులు.
ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త వర్క్స్ మొదలుపెట్టరు.
ఆఫీసులో వస్తువులు వాడకం తగ్గిస్తారు.
పేపర్ వేస్టేజ్ తగ్గించడానికి ఈ టెక్నాలజీని ఉపయోగిస్తారు.