బెర్లిన్, పారిస్ దాకా చేరుకోగలవు.. ఇరాన్ మిసైల్స్పై ఇజ్రాయెల్ కామెంట్

బెర్లిన్, పారిస్ దాకా చేరుకోగలవు.. ఇరాన్ మిసైల్స్పై ఇజ్రాయెల్ కామెంట్

టెల్​అవీవ్: ఇరాన్  మొదటిసారిగా దీర్ఘశ్రేణి మిసైల్స్​ను ప్రయోగించిందని ఇజ్రాయెల్  పేర్కొంది. పశ్చిమాసియాను దాటి ఇరాన్  దాడులు చేయడం ప్రారంభించిందని ఇజ్రాయెల్  మిలిటరీ చీఫ్  ఆయాల్  జమీర్  ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. లాంగ్ రేంజ్  మిసైల్స్​తో ఇజ్రాయెల్​పై దాడి చేసే ఉద్దేశం ఇరాన్​కు లేకపోయినా.. వాటి స్థాయి బెర్లిన్, పారిస్, రోమ్  వంటి యురోపియన్  నగరాలకు చేరేంత ఉందని చెప్పారు. 

కాగా.. హిందూ మహాసముద్రంలోని యూఎస్, యూకే మిలటరీ బేస్  డియాగో గార్సియాను లక్ష్యంగా చేసుకుంటూ 4 వేల కిలోమీటర్ల స్థాయి ఉన్న రెండు బాలిస్టిక్  మిసైళ్లను ఇరాన్  ప్రయోగించింది. ఇరాన్ మిసైల్ సైట్లపై దాడులు చేయడానికి బ్రిటిష్​  మిలిటరీ బేస్​ను అమెరికా వాడుకునేందుకు అనుమతిచ్చే ముందే ఇరాన్  ఆ క్షిపణులను ప్రయోగించిందని బ్రిటన్  రక్షణ శాఖ పేర్కొంది.