బధిరుల ఒలింపిక్స్‌‌‌‌ అథ్లెట్లకు ప్రధాని ఆతిథ్యం

బధిరుల ఒలింపిక్స్‌‌‌‌ అథ్లెట్లకు ప్రధాని ఆతిథ్యం

న్యూఢిల్లీ: ‘మీ అత్యుత్తమ పెర్ఫామెన్స్‌‌‌‌‌‌‌‌‌‌తో దేశానికి కీర్తి ప్రతిష్టలు తేవడంతో పాటు మమ్మల్ని గర్వపడేలా చేశారని’ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ.. బధిరుల ఒలింపిక్స్‌‌‌‌లో మెడల్స్‌‌‌‌ సాధించిన అథ్లెట్లతో అన్నారు. మెగా ఈవెంట్‌‌‌‌లో పతకాలు గెలిచిన క్రీడాకారులకు శనివారం ప్రధాని తన అధికారిక నివాసంలో ఆతిథ్యం ఇచ్చారు. 
‘మీలాంటి చాంపియన్లతో ఈ ఆత్మీయ సమావేశాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను. మీ పెర్ఫామెన్స్‌‌‌‌తో దేశం గర్వపడేలా చేశారు. ఆటలపై మీకున్న ఆసక్తి, అంకిత భావాన్ని.. మీరు పంచుకున్న అనుభవాలతో నేను తెలుసుకోగలిగాను. మీ అందరికి నా బెస్ట్‌‌‌‌ విషెస్‌‌‌‌’ అని మోడీ ట్వీట్‌‌‌‌ చేశారు. ఈసారి బధిరుల ఒలింపిక్స్‌‌‌‌ అత్యుత్తమంగా మారడానికి మన చాంపియన్లే కారణమని స్పోర్ట్స్‌‌‌‌ మినిస్టర్‌‌‌‌ అనురాగ్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌ అన్నారు. ఈ నెల 1 నుంచి 15 వరకు జరిగిన ఈ ఒలింపిక్స్‌‌‌‌లో ఇండియా 16 మెడల్స్‌‌‌‌ సాధించింది.