ఆసియా క్రీడల్లో ప్రతిభ చూపిన భారత్ షూటర్లకు ప్రధాని ప్రశంస

ఆసియా క్రీడల్లో ప్రతిభ చూపిన భారత్ షూటర్లకు ప్రధాని ప్రశంస

ఆసియా క్రీడల్లో పురుషఉల 50 మీటర్ల రైఫిల్ టీం ఈవెంట్ లో  విజేతలుగా నిలిచిన షూటర్లకు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. " అద్భుతమైన విజయం..ప్రతిష్టాత్మకమైన స్వర్ణం , ప్రపంచ రికార్డు. ఆసియా క్రీడల్లో పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3Ps టీమ్ ఈవెంట్‌లో విజేతలుగా నిలిచినందుకు స్వప్నిల్ కుసాలే, ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, అఖిల్ షియోరాన్‌లకు అభినందనలు. ఏషియన్ క్రీడల్లో వారు  కృషి, పట్టుదలను ప్రదర్శించారు. వారికి నా శుభాకాంక్షలు ’’అని ట్వీట్‌లు చేశారు ప్రధాని మోదీ.

ALSO READ  : భారత్‌తో సన్నిహిత సంబంధాలకు కట్టుబడి ఉన్నాం : జస్టిన్ ట్రూడో

 మరోవైపు ‘‘10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మహిళల టీమ్ ఈవెంట్‌లో సిల్వర్ మెడల్ సాధించిన దివ్య తాడిగోల్, ఈషా సింగ్ , పాలక్‌లకు అభినందనలు. వారి భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు. వారి విజయం రాబోయే పలువురు క్రీడాకారులకు ప్రేరణనిస్తుంది’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.