వరంగల్, హనుమకొండ, వెలుగు: పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసి మావోయిస్టుల చేతిలో ప్రాణాలు కోల్పోయిన ఆర్ఎస్ఎస్, బీజేపీతో పాటు ఏబీవీపీ నేతల కుటుంబ సభ్యులను శనివారం ప్రధాని మోదీ ఆప్యాయంగా పలకరించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ గ్రౌండ్లో విజయ్ సంకల్పసభ వేదిక వద్ద 12 మంది ఫ్యామిలీ మెంబర్స్తో ప్రధాని ప్రత్యేకంగా మాట్లాడారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
అమరుల సేవలను కొనియాడారు. ఇందులో సామ జగన్మోహన్ రెడ్డి, దగ్గు వెంకటేశ్వరరావు, ఎం.రాఘవేందర్ రెడ్డి, కీర్తి చక్ర పూజరి మాణిక్యం, లక్కర్సు రాజేశం, సీహెచ్.రవీందర్రెడ్డి, కె.గోపాల్రెడ్డి, డాక్టర్ సౌందరయ్య, కె.కోదండరామిరెడ్డి, ఎస్.భీంరావు, అరవింద్ గౌడ్, సీహెచ్. కృష్ణ కుటుంబాలకు చెందినవారు ఉన్నారు.