హాస్టల్కు సెల్ఫోన్ తెచ్చాడని స్టూడెంట్ను చితకబాదిన ప్రిన్సిపాల్

హాస్టల్కు సెల్ఫోన్ తెచ్చాడని స్టూడెంట్ను చితకబాదిన ప్రిన్సిపాల్

కూకట్​పల్లి, వెలుగు: కాలేజీ హాస్టల్​కు సెల్​ఫోన్​ తెచ్చిన ఓ విద్యార్థిని ప్రిన్సిపాల్​ చిదకబాదిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్​కు చెందిన కె.తిరుపతి కొడుకు కేపీహెచ్​బీ సాయినగర్​లోని శ్రీవశిష్ట జూనియర్​ కాలేజీలో ఇంటర్​ ఫస్టియర్​ చదువుతూ వారి హాస్టల్​లోనే ఉంటున్నాడు.

నవంబర్​ 30న కాలేజీ ప్రిన్సిపాల్​ హాస్టల్​లో చెకింగ్​ చేస్తుండగా అతడి వద్ద మొబైల్​ ఫోన్​ దొరికింది. దీంతో ప్రిన్సిపాల్​ సదరు స్టూడెంట్​ను కర్రతో చితకబాదడంతో వీపుపై వాతలు పడ్డాయి. విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో బుధవారం కేపీహెచ్​బీ పోలీసుస్టేషన్​లో ఫిర్యాదు చేశారు. అంతకుముందు కాలేజీ యాజమాన్యంతో గొడవకు దిగారు.