న్యూఢిల్లీ: రద్దీ సమయాల్లోనూ పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు నాణ్యమైన నెట్వర్క్అందించడానికి తీసుకొచ్చిన ప్రయారిటీ సర్వీస్ నెట్ న్యూట్రాలిటీ నిబంధనలకు వ్యతిరేకం కాదని ఎయిర్టెల్.. టెలి కమ్యూనికేషన్ల శాఖ (డాట్) కమిటీకి తెలిపింది.
దీనివల్ల ప్రిపెయిడ్ కస్టమర్లకు ఇబ్బందులు రావని స్పష్టం చేసింది. ఈ సర్వీసు ట్రాయ్, డాట్ ఫ్రేమ్వర్క్ ప్రకారమే ఉంటుందని పేర్కొంది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకు ప్రత్యేక సదుపాయాలు ఇవ్వబోమని తెలిపింది.
