Prithvi Shaw: పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ముంబైకి గుడ్ బై చెప్పి వేరే రాష్ట్రానికి టీమిండియా ఓపెనర్

Prithvi Shaw: పృథ్వీ షా సంచలన నిర్ణయం.. ముంబైకి గుడ్ బై చెప్పి వేరే రాష్ట్రానికి టీమిండియా ఓపెనర్

ముంబై యువ బ్యాటర్ పృథ్వీ షా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. షా తన సొంత రాష్ట్రమైన ముంబైకి గుడ్ బై చెప్పి మరో రాష్ట్రం తరపున ప్రొఫెషనల్ క్రికెట్ ఆడదామని నిర్ణయించుకున్నట్టు సమాచారం. మరొక రాష్ట్రం తరపున ఆడటానికి ముంబై క్రికెట్ అసోసియేషన్ (MCA) నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC) కోరాడు. "పృథ్వీ షా నో-అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోరుతూ మాకు లేఖ రాశారు. మేము అపెక్స్ కౌన్సిల్ సభ్యులతో దాని గురించి చర్చిస్తున్నాము. ఈ రోజు సాయంత్రం నాటికి మేము మా నిర్ణయం తీసుకుంటాము" అని ముంబై క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అభయ్ హడప్ ధృవీకరించారు. 

ALSO READ | Rohit Sharma: ఈ రోజు ఎప్పటికీ గొప్పే: 18 సంవత్సరాల క్రికెట్ ప్రయాణంపై రోహిత్ ఎమోషనల్

ఈ డాషింగ్ ముంబై ఓపెనర్ ఇటీవల వివాదాల్లో చిక్కుకున్నాడు. ముంబై క్రికెట్ అసోసియేషన్ షాపై క్రమశిక్షణా చర్యలు ఆరోపణలు చేసి, అతను జట్టులో అనర్హుడని భావించింది. ఈ నెల ప్రారంభంలో షాకు రెండు రాష్ట్ర జట్ల నుండి ఆఫర్లు వచ్చినట్టు సమాచారం. కొన్ని నెలల క్రితం యశస్వి జైస్వాల్ గోవా తరఫున ఆడాలని నిర్ణయించుకుని  నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కోసం కూడా ప్రయత్నించాడు. అయితే  కానీ కొన్ని వారాల తర్వాత యూ-టర్న్ తీసుకున్నాడు. లెజెండరీ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్, ముంబై తరపున అవకాశాలు లేవని గ్రహించి 2022నుంచి గోవా తరపున ఆడుతున్నాడు.  

MCA కి రాసిన లేఖలో, షా తనకు వేరే జట్టుతో ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటానికి ఆఫర్ వచ్చిందని తెలిపాడు. "నా కెరీర్‌లో వేరే రాష్ట్రం తరపున ప్రొఫెషనల్ క్రికెట్ ఆడటానికి నాకు మంచి అవకాశం లభించింది. ఇది క్రికెటర్‌గా నా వృద్ధికి, అభివృద్ధికి మరింత దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను. రాబోయే డొమెస్టిక్ సీజన్‌లో కొత్త రాష్ట్రానికి అధికారికంగా ఆడడానికి వీలు కల్పించే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)ని నాకు జారీ చేయాలని నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను". అని షా లెటర్ లో రాసుకొచ్చాడు. 

అద్భుతమైన టాలెంట్‌‌‌‌ ఉన్నా.. దాన్ని సరైన రీతిలో సద్వినియోగం చేసుకోలేక టీమిండియాకు దూరమైన షా ఐపీఎల్‌‌‌‌ చాన్స్‌‌‌‌ కూడా కోల్పోయాడు.  2025 ఐపీఎల్ మెగా ఆక్షన్ లో ఇటీవలే జరిగిన మెగా ఆక్షన్ లో అతన్ని ఎవరూ తీసుకోలేదు. ముస్తాక్ అలీ ట్రోఫీ ద్వారా కంబ్యాక్ ఇద్దామనుకున్నా సాధ్యం కాలేదు. 2018లో ఐపీఎల్‌‌‌‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌‌‌‌కు ఆడుతున్న పృథ్వీ పవర్‌‌‌‌‌‌‌‌ప్లే స్పెషలిస్ట్‌‌‌‌గా పేరు తెచ్చుకున్నాడు.

లీగ్‌‌‌‌లో 79 మ్యాచ్‌‌‌‌లు ఆడి 14 ఫిఫ్టీలు సహా 1892 రన్స్ చేశాడు. తొలి ఓవర్లోనే ఆరు బాల్స్‌‌‌‌లో ఆరు ఫోర్లు కొట్టిన రికార్డు కూడా తన పేరిట ఉన్నా వేలంలో డీసీ పట్టించుకోలేదు. మిగతా ఫ్రాంచైజీలు కూడా ఆసక్తి చూపలేదు. రెండుసార్లు వేలంలో అతని పేరు వినిపించినా.. ఎవ్వరూ ముందుకు రాలేదు. దాంతో ఆరేండ్ల కిందట అండర్‌‌‌‌‌‌‌‌ 19 వరల్డ్ కప్‌‌‌‌ నెగ్గిన కెప్టెన్‌‌‌‌గా ప్రశంసలు అందుకొని ఇండియా క్రికెట్‌‌‌‌లో  సచిన్‌‌‌‌ టెండూల్కర్‌‌‌‌‌‌‌‌ తర్వాత ఆ స్థాయికి వెళ్తాడని అనుకున్న పృథ్వీ  కెరీర్‌‌‌‌‌‌‌‌ అత్యల్ప స్థాయికి చేరుకుంది. 

సాధారణంగా టీమిండియాకు దూరమైన ఆటగాళ్లు డొమెస్టిక్ క్రికెట్‌‌‌‌లో సత్తా చాటి తిరిగి వస్తుంటారు. అయితే,  రంజీలతో పాటు కౌంటీ క్రికెట్‌‌‌‌లో  అప్పుడప్పుడు మెరిసినా షా నేషనల్ టీమ్‌‌‌‌లోకి తిరిగి రాలేకపోవడానికి కారణం అతని క్రమశిక్షణ లేకపోవడమే. చిన్న వయసులోనే వచ్చిన స్టార్‌‌‌‌‌‌‌‌డమ్‌‌‌‌ అతనిపై ప్రతికూల ప్రభావం చూపింది. ఒకప్పుడు ఇరుకు గదిలో ఉండి, లోకల్ ట్రెయిన్‌‌‌‌లో నిల్చొని ప్రయాణించి వచ్చి  గ్రౌండ్‌‌‌‌లో గంటల కొద్దీ ప్రాక్టీస్‌‌‌‌ చేసిన షా.. తాను సెలబ్రిటీ అయిన తర్వాత గాడి తప్పాడు.

పబ్బులు, అమ్మాయిలు అంటూ పక్కదారి పట్టి క్రికెట్‌‌‌‌ను నిర్లక్ష్యం చేశాడు. కనీసం తన శరీరంపై కూడా శ్రద్ధ చూపలేక బరువు పెరిగిన షా ఫిట్‌‌‌‌నెస్  కూడా కోల్పోయాడు. దాంతో కొన్ని రోజుల కిందట ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ) అతడిని రంజీ జట్టు నుంచి కూడా తప్పించింది.  2018లో తన తొలి రెండు టెస్టుల్లో  ఓ సెంచరీ, ఫిఫ్టీతో మెరిసిన పృథ్వీ 2020లో తర్వాతి మూడు టెస్టుల్లో నిరాశపరిచాడు. 2020–21లో ఆరు వన్డేలు ఆడినా ఒక్క ఫిఫ్టీ కూడా కొట్టలేకపోయాడు. దాంతో నేషనల్ టీమ్‌‌‌‌లో చోటు కోల్పోయిన షా మూడేండ్లయినా తిరిగి రాలేకపోయాడు. టన్నుల కొద్దీ టాలెంట్‌‌‌‌ ఉన్నా.. క్రమశిక్షణ లేకపోవడం వల్లనే  షా క్రికెట్ జీవితం ఇలా తలకిందులైందని చెప్పొచ్చు.