సగం స్టాఫ్​, సగం శాలరీస్​తో… ప్రైవేట్​ స్కూళ్లు

సగం స్టాఫ్​, సగం శాలరీస్​తో… ప్రైవేట్​ స్కూళ్లు

టీచర్లతో ఆన్​లైన్​ క్లాస్​లు, అడ్మిషన్​ వర్క్స్

హైదరాబాద్, వెలుగు: సిటీలో ప్రైవేట్, కార్పొరేట్​ స్కూళ్లు తెరుచుకున్నాయి. ప్రభుత్వ నిబంధనల మేరకు మేనేజ్​మెంట్లు 50 శాతం మంది టీచర్లను రప్పిస్తున్నాయి. సగం శాలరీనే చెల్లించేలా ముందే అగ్రిమెంట్​ చేసుకుంటున్నాయి. నెలలుగా ఉపాధి లేక ఇళ్లకే పరిమితమవడంతో టీచర్లూ ఓకే చెప్తున్నారు. స్కూల్​కి వస్తున్న టీచర్లు ఆన్​లైన్​ క్లాసులు, అడ్మిషన్ కు సంబంధించిన పనులు చూసుకుంటున్నారు. లాక్​డౌన్ కారణంగా స్టూడెంట్స్​ నుంచి ఫీజు వసూలు రాలేదని, టీచర్లతోనూ హాఫ్​ డే మాత్రమే వర్క్​ చేయిస్తున్నందున సగం జీతం ఇవ్వాలనుకుంటున్నామని పలు మేనేజ్​మెంట్లు తెలిపాయి. మరోవైపు బస్తీలు, కాలనీల్లోని బడ్జెట్ ప్రైవేట్​స్కూల్స్​రీ ఓపెన్​ అవలేదు. స్టూడెంట్స్​ నెలనెలా ఇచ్చే తక్కువ ఫీజులతో నడిచే ఈ స్కూళ్లు ఇప్పట్లో తెరుచుకోవడం కష్టంగా కనిపిస్తోంది. కొన్ని స్కూళ్లు మాత్రం తమ స్టూడెంట్స్​వేరే స్కూల్​కి వెళ్లకుండా కాపాడుకునేందుకు నలుగురైదురు టీచర్లను నియమించుకుని మొబైల్​ యాప్ ద్వారా ఫ్రీ ఆన్​లైన్​క్లాస్​లు కండక్ట్​ చేస్తున్నాయి.

ఏజెన్సీలతో నడిపిస్తున్నరు

కొన్ని ప్రైవేట్ స్కూల్​మేనేజ్​మెంట్లు పూర్తిస్థాయిలో టీచర్లను విధుల్లోకి తీసుకోవడం లేదు. ఏజెన్సీల ద్వారా ఆన్ లైన్ క్లాసులు నిర్వహిస్తున్నాయి. లాక్​డౌన్​తో ఆరు నెలల నుంచి ఉపాధి కోల్పోయిన టీచర్లను మొత్తానికే తొలగించి రోడ్డున పడేయొద్దు.

– షేక్ షబ్బీర్ అలీ, తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు

తిరిగి తీసుకోవాలె

లాక్​డౌన్​ నుంచి జీతం లేక నానా ఇబ్బందులు పడుతున్నాం. స్కూల్స్​  రీ ఓపెన్​ అయితే మళ్లీ ఉపాధి దొరకుతుందనుకున్నాం. కానీ, ప్రైవేట్​ స్కూళ్లు చాలామంది టీచర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవడం లేదు.

-లక్ష్మి, ప్రైవేట్​ టీచర్, మూసాపేట

For More News..

రెడీ అవుతున్నసిటీ బస్సులు

ఆన్​లైన్​ క్లాస్​లపై ఎవరి ఆర్డర్లు వాళ్లవే

నవంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో దుబ్బాక బై పోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌