రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం.. కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు స్పాట్ డెడ్..

రంగారెడ్డి జిల్లాలో ఘోర విషాదం.. కారును ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ముగ్గురు స్పాట్ డెడ్..

సాగర్ రోడ్డుపై  ఘోర  ప్రమాదం చోటు చేసుకుంది. కారును ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా యాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని మాల్ దగ్గర జరిగింది ఈ దుర్గటన.  

 హైదరాబాద్ కు  చెందిన ఏడుగురు స్నేహితులు వైజాగ్ కాలని నుంచి కియా కార్ లో హైదరాబాద్ వస్తుండగా రాత్రి 1-:30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది.  మాల్ సమీపంలో తమ్మలోనిగూడ గేట్ దగ్గర ఎదురుగావస్తున్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఢీకోనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.  మరో ఇద్దరికి  తీవ్రగాయాలయ్యాయి.  గాయపడ్డ మరో ఇద్దరిని  మాల్ పీపుల్స్ హాస్పటల్ కి తరలించారు.

బుధవారం ( జూన్11) 01:00 గంటలకు నల్గొండ  వైజాగ్ కాలనీ నుండి హైదరాబాద్ వైపు కియా కారెన్స్ కారు Br.No: TS02FG9185 లో మొత్తం 07 మంది వ్యక్తులు వస్తున్నారు. కారు సాగర్ హైవేలోని మాల్ విలేజ్ శివార్లకు చేరుకోగా ఈ యాక్సిడెంట్ జరిగింది. నల్గొండ వైపు వెళ్తున్న గిరిధర్ ట్రావెల్స్ బస్సు Br.No. AP39TD6766 ఎదురుగా ఉన్న కారును ఢీకొట్టింది. 

దీంతో కారు డ్రైవర్ వాసా సాయి తేజ(24) (బాలానగర్, హైదరాబాద్), వాసా పవన్ కుమార్(26) (బిఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం)    వాసా రాఘవేంద్ర (22) (బిఎన్ రెడ్డి నగర్ వనస్థలిపురం)లు అక్కడికక్కడే మరణించారు.  వాసా శివ కుమార్(25) (బాలానగర్, హైదరాబాదు), వాసా సాయి కుమార్ (22) (బాలానగర్ హైదరాబాదు), ఎం. సందీప్(25) , (మూసాపేట హైదరాబాద్), ఇ.శివ కుమార్ లు తీవ్రంగా గాయపడ్డారు, గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యాచారం  పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.