
తమిళంలో స్టార్ హీరోయిన్గా పేరుతెచ్చుకున్న ప్రియా భవానిశంకర్ ‘కళ్యాణం కమనీయం’ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. సంతోష్ శోభన్ హీరోగా అనిల్ కుమార్ ఆళ్ల దర్శకత్వంలో యూవీ కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన ఈ మూవీ ఇవాళ ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా ప్రియ మాట్లాడుతూ ‘యూవీ లాంటి పెద్ద బ్యానర్తో తెలుగులో లాంచ్ అవ్వడం సంతోషంగా ఉంది. నిజ జీవితానికి దగ్గరగా ఉండే చిత్రాలంటే చాలా ఇష్టం. అలాంటి ఒక మంచి కథతో తెరకెక్కిందే ఈ సినిమా.
పనిలేని భర్త శివ, ఉద్యోగానికెళ్ళే భార్య శృతి, ఇద్దరి మధ్య చుట్టూ ఉన్నవాళ్ళ మాటలు, అభిప్రాయాల వల్ల మొదలైన ఒక సమస్య ఎంత దూరం వెళ్ళింది అన్నదే కథాంశం. శృతి పాత్రకి నాకు దాదాపు తొంభై శాతం పోలికలున్నాయి. అందుకే పెద్దగా కష్టపడాల్సిన అవసరం రాలేదు. శృతి పాత్రలో మీ చెల్లెళ్ళు, అమ్మలు, కూతుళ్లు అందరూ తమని తాము చూసుకుంటారు. సంతోష్ అద్భుతమైన నటుడు. నాకు సెట్స్లో ప్రామ్టింగ్ నచ్చదు, ఈ విషయంలో సంతోష్ శోభన్ నాకు డైలాగ్స్లో హెల్ప్ చేసారు. ప్రస్తుతం నాగచైతన్యతో ‘దూత’, సత్యదేవ్తో ఓ మూవీ చేస్తున్నాను’ అని చెప్పింది.