
పవర్ స్టార్ పవన్ కల్యాన్ ‘ఓజీ’ సినిమా ఆఫర్తో ప్రియాంక అరుల్ మోహన్ ట్రెండింగ్గా మారింది. తెలుగులో చేసింది రెండు సినిమాలే అయినా.. ఈ అమ్మడికి ఇంత భారీ అవకాశం ఇవ్వడం హాట్టాపిక్గా మారింది. అయితే, ప్రియాంకను ఈ రోల్ కోసం తీసుకోవడం పూర్తిగా డైరెక్టర్ సుజిత్ చాయిస్ అని తెలుస్తోంది.
నాని గ్యాంగ్లీడర్, శ్రీకారం వంటి సినిమాల్లో ఈ బ్యూటీ స్క్రీన్ ప్రెజెన్స్ ఈ కుర్ర దర్శకుడిని ఇంప్రెస్ చేసిందట. అందుకే తన సినిమాలో ప్రియాంకను ఫిక్స్ చేశాడని టాక్. ఓజీ చాన్స్తో ఈ సౌత్ బ్యూటీకి సోషల్ మీడియా ఫాలోయింగ్ ఒక్కసారిగి పెరిగిపోయింది.
టాలీవుడ్ నుంచి సైతం భారీ ఎత్తున అవకాశాలు వస్తున్నాయట. ప్రస్తుతం తన ఫోకస్ అంతా పవన్ సినిమాపైనే అంటూ కొత్త కమిట్మెంట్స్కి నో చెబుతోందనే రూమర్స్ వినిపిస్తున్నాయి.