మూడేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన ప్రియాంక

మూడేళ్ల తర్వాత ఇండియాకు వచ్చిన ప్రియాంక

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా నటించి మెప్పించిన ప్రియాంక చోప్రా ముంబై ఎయిర్ పోర్టులోకి అడుగు పెట్టారు. దాదాపు మూడేళ్ల తర్వాత భారత్ కు వచ్చారు. పెళ్లి చేసుకున్న అనంతరం భర్త నిక్ జోనస్ తో లాస్ ఏంజెల్స్ లో సెటిల్ అయ్యారు. సోమవారం రాత్రి ఆమె ముంబై ఎయిర్ పోర్టులో దిగారు. ప్రియాంకకు అభిమానులు గ్రాండ్ వెల్ కమ్ చెప్పారు. ప్ల కార్డులతో స్వాగతం పలికారు. ఆమె వెంట భర్త, కూతురు కూడా ఉన్నారు. మూడేళ్ల తర్వాత ఇంటికి వెళుతున్నానంటూ... బోర్డింగ్ పాస్ కు సంబంధించి ఫొటోను ప్రియాంక షేర్ చేశారు. 

2007లో ‘బేవాచ్’ సినిమాతో ప్రియాంక వెండి తెరపై కనిపించారు. తనకంటే పదేళ్లు చిన్నవాడైన ప్రముఖ పాప్ సింగర్ ‘నిక్ జొనాస్’తో పరిచయం ఏర్పడింది. కొన్నాళ్ల డేటింగ్ అనంతరం 2018లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి భర్తతో కలిసి ప్రియాంక లాస్ ఏంజిల్స్ లోనే నివాసం ఉంటున్నారు. సరోగసీ పద్ధతిలో ఇటీవలే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. కూతురు ముఖం కనిపించకుండా ఎమోజీలతో కవర్ చేశారు.