
రాజకీయాలతో విసిగిపోయానని నటి ప్రియాంకా చోప్రా ఇటీవల ఎందుకు వ్యాఖ్యానించిందని సినీ అభిమానులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై సిటాడెల్ ప్రీమియర్లో భాగంగా ఆమె మరోసారి రెస్పాండ్అయ్యారు.
‘నేను ఓ పాడ్ కాస్ట్లో పాల్గొన్నప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకూ నా లైఫ్లో జరిగిన ప్రతి విషయాన్నీ వెల్లడించా. నా లైఫ్లో ఎదురైన బాలీవుడ్లోని రాజకీయాలు గురించి మాట్లాడటానికి ఇన్నాళ్లకు నాకు ధైర్యం వచ్చిందని భావిస్తున్నా. బాలీవుడ్లో అప్పుడు నాకు ఎదురైన పరిస్థితుల్లో ఎన్నో గందరగోళ సంబంధాలను చూశాను. జరిగిన వాటన్నింటినీ క్షమించి. చాలా కాలం క్రితమే ముందుకు అడుగు వేశాను’అని వివరించారు. అందులో పాల్గొన్న వాళ్లు అడగడంతో ఈ విషయాలను పంచుకున్నట్లు తెలుస్తోంది.