వారణాసి: కాంగ్రెస్ కుటుంబ వారసత్వ పాలనలో వ్యవస్థలు నిర్వీర్యమైపోయాయన్న ధాని మోడీకి కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ ఘాటుగా బదులిచ్చారు. గడిచిన ఐదేండ్లలో నరేంద్ర మోడీ వ్యవస్థల్ని ఎలా నాశనం చేశారో జనమంతా చూశారని,ప్రజల్ని ఫూల్స్గా లెక్కగడ్డం ప్రధాని ఇకనైనా మానుకోవాలని, మంచిచెడుల్ని జనం గ్రహిస్తారని అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రియాంక చేపట్టిన గంగా యాత్ర బుధవారంతో ముగిసింది. చివరి మజిలీగా వారణాసిలోని అస్సీ ఘాట్కు చేరుకున్న
కాంగ్రెస్ నేత కాశీ విశ్వనా థ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత సాధువుల ఆశీర్వాదాలు తీసుకు న్నారు. బెదిరిస్తే భయపడం పీఎం మోడీ తన బ్లాగ్లో రాసిన వ్యాసంపై స్పందిం చిన ప్రియాంక, ‘‘అధికారంలో ఉన్నోళ్లకు రెండు రకాల అభిప్రాయాలుంటాయి. ఒకటి, ప్రజల్ని చాలా సులువుగా తప్పుదోవపట్టించొచ్చుని అను కుంటారు. రెండోది అధికార దండంతో అందరినీ బెదిరిస్తారు. వీళ్ల బెదిరింపులకు కాంగ్రెస్ భయపడదు. మమ్మల్ని ఏం చేసినా, ఎంతలా వేధించినా పోరాడుతూనే ఉంటాం . గత ఐదేండ్ లుగా మోడీ పద్ధతి ప్రకారం ఇనిస్టిట్యూ షన్స్ని నాశనం చేశారు. మీడియా గొంతునొక్కిందీ ఆయనే. పని చేయకుండా కేవలం ప్రచారంతో నే గెలవొచ్చనుకుంటున్నారు. అలాంటి వాళ్లకు జనం గట్టిగా బుద్ధి చెప్పాలి’’అని అన్నారు.