మీకు దమ్ముంటే నాపై కేసులు పెట్టండి

మీకు దమ్ముంటే నాపై కేసులు పెట్టండి
  • ఆక్సిజన్ కొరతలేకపోతే నాపై కేసులు పెట్టండి..
  • ఆస్తులు స్వాధీనం చేసుకోండి
  • యూపీ ప్రభుత్వానికి ప్రియాంక గాంధీ సవాల్

న్యూఢిల్లీ: ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని హాస్పిటల్స్ లో ఆక్సిజన్ కొరత లేదంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తప్పుపట్టారు. ఇన్ సెన్సిటివ్ ప్రభుత్వాలు మాత్రమే అలాంటి ప్రకటనలు చేస్తాయని ఆమె విమర్శించారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం అంతటా ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉందన్నారు ప్రియాంక. అవసరమైతే తనపై కేసు పెట్టాలని, తన ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని సవాల్ చేశారు. కానీ భగవంతుని కోసమైనా ప్రజలను రక్షించే ప్రయత్నాలు ప్రారంభించాలని యోగి ఆదిత్యనాథ్ కు సూచించారు. రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని, అలా ఆరోపణలు చేసిన వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు సీఎం యోగీ ఆదిత్యనాథ్.