గేమ్ ఛేంజర్ మూవీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన దిల్ రాజు.. పాపం మెగా ఫ్యాన్స్!

గేమ్ ఛేంజర్ మూవీపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన దిల్ రాజు.. పాపం మెగా ఫ్యాన్స్!

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ గేమ్ ఛేంజర్(Game Changer). తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Shankar) తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ(Kiara Awani) హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా లెవల్లో భారీగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా కావడంతో.. భారీ అంచనాలు ఏర్పడ్డారు. అందుకే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇటీవల దీపావళి సందర్బంగా మొదటి పాటను రిలీజ్ చేస్తారని చెప్పి డిజప్పాయింట్ చేశారు మేకర్స్. దీంతో సినిమా రిలీజ్ పై కూడా సందేహంలో పడిపోయారు ఆడియన్స్.  

తాజాగా ఇదే విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు నిర్మాత దిల్ రాజు. రీసెంట్ గా ఆయన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆయన గేమ్ ఛేంజర్ సినిమా గురించి మాట్లాడుతూ.. గేమ్ ఛేంజర్ సినిమా షూట్ ప్రస్తుతం మైసూర్లో జరుగుతోంది. ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. వీలైనంత త్వరగా మిగతా పార్టీ పూర్తి చేస్తాము. అయితే.. రాజమౌళి, శంకర్, సుకుమార్, సందీప్ వంటి దర్శకులు మేకింగ్ విషయంలో అస్సలు రాజీపడరు. అలాంటి దర్శకులకు డెడ్ లైన్లు పెట్టేసి తొదరగా చేయమని చెప్పడం కరక్ట్ కాదు. 

గేమ్ ఛేంజర్ సినిమా విషయంలో మంచి క్వాలిటీ అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్  ఇవ్వడానికి దర్శకుడు శంకర్ చాలా కష్టపడుతున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ డేట్ పై మాత్రం ఇప్పుడే ఏమి చెప్పలేము. కారణం షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ కి ఎంత టైం పడుతుందో అనేది ముందే చెప్పలేము. వాటిపై క్లారిటీ వచ్చాక ఒక నిర్ణయానికి వస్తాము.. అంటూ చెప్పుకొచ్చారు దిల్ రాజు. ఇవన్నీ చూస్తుంటే గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ అవడానికి ఇంకా టైం పడుతుందని చెప్పకనే చెప్పేశాడు దిల్ రాజు.