కాలేజీ మేనేజ్మెంట్ ఇంటి ముందు డెడ్బాడీతో బంధువుల ధర్నా
హైదరాబాద్, వెలుగు: పోచంపల్లిలోని ఓ ఫార్మసీ కాలేజీలో పనిచేసే డాక్టర్ సైదులు యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతూ బ్రెయిన్డెడ్తో చనిపోయారు. వారి కుటుంబీకులు ఒప్పుకోవడంతో ఆయన అవయవాలను దానం చేశారు. అయితే కాలేజీలో కొన్ని నెలలుగా జీతాలివ్వకపోవడంతోనే మానసికంగా కుంగిపోయి సైదులు చనిపోయినట్టు కుటుంబీకులు, బంధువులు ఆరోపిస్తున్నారు. టీఎస్టీసీఈఏ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో సైదులు డెడ్ బాడీతో బంధువులు మైత్రివనంలోని కాలేజీ మేనేజ్ మెంట్ ఇంటిముందు గురువారం ఆందోళన నిర్వహించారు.
సైదులు 12 ఏండ్లుగా అదే కాలేజీలో పనిచేస్తున్నాడని, 8 రోజులు హాస్పిటల్లో ఉన్నా మేనేజ్ మెంట్ కనీసం పట్టించుకోలేదని మండిపడ్డారు. దీంతో స్పందించిన మేనేజ్ మెంట్ ఆయన పూర్తి జీతాన్ని వెంటనే ఇచ్చేందుకు అంగీకరించింది. రూ.50 వేల క్యాష్, రూ.2.50లక్షల చెక్కును సైదులు కుటుంబసభ్యులకు అందించింది. అనంతరం సైదులు డెడ్బాడీని ఆయన స్వగ్రామం నకిరే
కల్కు తరలించారు.