![ప్రొఫెసర్ కోదండరామ్కు అస్వస్థత](https://static.v6velugu.com/uploads/2024/02/18_FUb4fIL6NA.jpg)
హైదరాబాద్, వెలుగు : టీజేఎస్ అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరామ్ డీ హైడ్రేషన్కు గురయ్యారు. ఐదు రోజులుగా ఆయన తార్నాకలోని తన నివాసంలోనే రెస్ట్ తీసుకుంటున్నారు. వారం నుంచి పార్టీ ఆఫీసుకు, విజటర్స్కు, వివిధ పోగ్రాంలకు కోదండరామ్ దూరంగా ఉంటున్నారు. ఇటీవల హాస్పిటల్కు వెళ్లి టెస్ట్లు చేయించుకున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రస్తుతం కోదండరామ్ ఆరోగ్యం మెరుగైందని.. త్వరలోనే పార్టీ ఆఫీస్కు వస్తారని పేర్కొన్నారు.