హైదరాబాద్, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీ ఇన్చార్జి వీసీగా ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్ ప్రొ.వెంకటరమణ శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇన్చార్జి వైస్ చాన్స్లర్గా ఉన్న రాహుల్ బొజ్జాను రిలీవ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే పూర్తి స్థాయి వీసీని నియ మించే అవకాశం ఉంది. వరద పరిస్థి తులు సద్దుమణిగాక కొత్త వీసీని నియ మించే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
