IAS, IPS అధికారులకు పదోన్నతి

IAS, IPS అధికారులకు పదోన్నతి

హైదరాబాద్: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1997 బ్యాచ్ ఐఏఎస్ అధికారులు శైలజా రామయ్య, ఎన్.శ్రీధర్, అహ్మద్ నదీమ్, మీర బ్రహ్మయ్య లకు ముఖ్య కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం తరపున చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు.

అలాగే 2009 బ్యాచ్ కు చెందిన ప్రశాంతి, సర్ఫరాజ్ అహ్మద్, హర్వీందర్ సింగ్, సత్యనారాయణలకు సెలక్షన్ గ్రేడ్ పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా శశాంక,శృతి ఓఝా, సీహెచ్ శివలింగయ్య, వి.వెంకటేశ్వర్లు, హనుమంతరావు, అమోయ్ కుమార్, కె.హైమావతి, ఎం.హరిత లను జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ గ్రేడ్ (పే12మ్యాటిక్స్) కు పదోన్నతి కల్పించారు. అనుదీప్ దురిషెట్టి, రిజ్వాన్ బాష, కోయ శ్రీహర్ష, అభిలాష అభినవ్, కుమార్ దీపక్, ఆదర్శ్ సురభి, తేజస్ నందలా పవార్, హేమంత్ బోర్కండే లను సూపర్ టైం స్కేల్ కు పదోన్నతి కల్పించారు. 
పదోన్నతి పొందిన ఐపీఎస్ లు వీరే
2004 బ్యాచ్ కు చెందిన ఐపీఎస్ అధికారులు తరుణ్ జోషి, శివకుమార్, కమలాసన్ రెడ్డి, ఏఆర్ శ్రీనివాస్ లకు ఐజీలుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కమలాసన్ రెడ్డిని డీజీపీ కార్యాలయంలో పోస్టింగ్ ఇవ్వగా.. మిగిలిన అధికారులందరూ ప్రస్తుతం ఉన్న పోస్టుల్లోనే కొనసాగిస్తూ చీఫ్ సెక్రెటరీ సోమేష్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు.

1997 బ్యాచ్ కు చెందిన తక్ఫీర్ ఇక్బాల్ కు డీఐజీగా పదోన్నతి కల్పించగా..ఇదే బ్యాచ్ కు చెందిన విజయ్ కుమార్, నాగిరెడ్డి, దేవేంద్రసింగ్ చౌహాన్, సంజయ్ జైన్ లకు అదనపు డీజీలుగా పదోన్నతి కల్పించారు. అదేవిధంగా 2009 బ్యాచ్ కు చెందిన అబర్ కిశోర్ ఝా, ఆర్.రాజేశ్వరి లకు సెలక్షన్ గ్రేడ్ పదోన్నతి కల్పించారు. 

 

ఇవి కూడా చదవండి

కేరళ సెంట్రల్ జైలులో 262 మంది ఖైదీలకు కరోనా

PRC GOలపై పిటిషన్ను విచారణకు స్వీకరించిన హైకోర్టు

ఆన్​లైన్​ అడిక్షన్.. పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్