రెవెన్యూ శాఖలో ప్రమోషన్స్‌‌‌‌ కల్పించాలి

రెవెన్యూ శాఖలో ప్రమోషన్స్‌‌‌‌ కల్పించాలి

ముషీరాబాద్, వెలుగు:  రెవెన్యూ శాఖలో ప్రమోషన్స్ లేక ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారని రాష్ట్ర రెవెన్యూ ఎంప్లాయీస్ నాన్ గెజిటెడ్ అసోసియేషన్ పేర్కొంది.  ఆదివారం ఇందిరా పార్కులో అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు కొండమల్ల రవి అధ్యక్షతన రాష్ట్ర సమావేశం జరిగింది. నూతన కమిటీని ఎన్నుకున్నారు. 

'కమిటీ అధ్యక్షుడిగా కొండమల్ల రవి,  గౌరవాధ్యక్షుడిగా శేఖర్,  ఉపాధ్యక్షుడిగాకాసార్ల శ్రీనివాసరావు ఎన్నికయ్యారు.  అధ్యక్షుడు  రవి మాట్లాడుతూ..    రెవెన్యూ శాఖలో ఉన్న సమస్యలను పరిష్కరించి ప్రమోషన్లు కల్పించాలని కోరారు.  వీఆర్ఏలు లేనందున ఆర్‌‌‌‌ఐలకు పనిభారం ఎక్కువైందన్నారు.