మునుగోడులో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

మునుగోడులో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ

మునుగోడు నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డికి నిరసన సెగ తగిలింది. చౌటుప్పల్ ఆరెగూడెంలో మల్లారెడ్డిని గౌడ కులస్తులు అడ్డుకున్నారు. కాటమయ్య గుడి కోసం 12 లక్షలు ఇస్తామని రెండ్రోజుల కింద ఒప్పుకొని 2 లక్షలు మాత్రమే ఇచ్చారని మండిపడ్డారు. 

మిగతా 10లక్షలు కూడా ఇవ్వాలని గౌడకులస్తులు డిమాండ్ చేశారు. ఎన్నికల తర్వాత ఎవరు రారంటూ నిలదీశారు. గౌడ సంఘ నాయకులు, యాదవ, వడ్డెర సంఘానికి కూడా మంత్రి మల్లారెడ్డి గుడుల నిర్మాణం కోసం హామీ ఇచ్చినట్లు స్థానికులు చెబుతున్నారు.