ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమమే... తిర్యాణి పోడు రైతుల హెచ్చరిక

ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమమే... తిర్యాణి పోడు రైతుల హెచ్చరిక

తిర్యాణి, వెలుగు: ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండల పోడు రైతులు గవర్నమెంట్​కు అల్టిమేటం జారీ చేశారు. గురువారం మండల కేంద్రంలోని చౌరస్తాలో ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. అనంతరం తహసీల్దార్ అనంతరాజుకు వినతిపత్రం అందజేశారు. ఆదివాసీ పోడు రైతులు మీడియాతో మాట్లాడారు. పోడు హక్కు పత్రాల పంపిణీలో తమకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

తమ భూములను సర్వే చేసి, అర్హులమైన తమకు హక్కు పత్రాలు ఇవ్వలేదని మండిపడ్డారు. న్యాయం చేయాలని వేడుకుంటున్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించడం లేదన్నారు. న్యాయం జరిగేవరకు పోరాడతామన్నారు. ధర్నాలో వివిధ గ్రామాల గిరిజన రైతులు పాల్గొన్నారు. వారికి ఆదివాసీ సంఘాల నాయకులు భగవంత రావు, సుభాశ్ తదితరులు మద్దతు పలికారు.