దీక్ష విరమించేది లేదు..అమరావతిపై ప్రకటన చేయాల్సిందే

దీక్ష విరమించేది లేదు..అమరావతిపై ప్రకటన చేయాల్సిందే

ఏపీలో మూడు రాజధానుల అంశంపై రగడ కొనసాగుతూనే ఉంది. రాజధానిపై స్పష్టమైన ప్రకటన చేసేవరకు ఆందోళనలు విరమించేది లేదంటున్నారు అమరావతి ప్రాంత రైతులు. తుళ్లూరులో రోడ్డుపైనే రైతులు ఆందోళనకు దిగారు. వంటావార్పు చేపట్టి పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. మహిళలు మోకాళ్లపై నిలబడి వినూత్నంగా నిరసన తెలిపారు. అమరావతిలోనే రాజధాని కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు మందడంలో మహా ధర్నా 11వ రోజుకు చేరుకుంది. రోడ్డుపై బైఠాయించిన రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తాడికొండ అడ్డరోడ్డు దగ్గర రైతులు రాస్తారోకో నిర్వహించి వంటావార్పు చేపట్టారు. వెలగపూడిలోనూ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పెద్దఎత్తున మహిళలు దీక్షా స్థలికి చేరుకుంటున్నారు.