
- పీఆర్ఆర్ డైరెక్టర్ సుచరిత రెడ్డి
ముషీరాబాద్, వెలుగు : పేదలకు కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ (పీ ఆర్ ఆర్) డైరెక్టర్ సుచరిత రెడ్డి అన్నారు. ఆదివారం రాంనగర్ డివిజన్ హరినగర్లో పైడి రాకేష్ రెడ్డి ఫౌండేషన్, దక్షిణ భారత సేవా సమాజ్, గ్రూప్ ఆఫ్ నైన్ స్టార్ కంపెనీస్, జీజీ చారిటీ ఆసుపత్రి సంయుక్త సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించి మాట్లాడారు.
బాగ్ లింగంపల్లిలో నెలకు రూ.20 లక్షల వరకు ఖర్చు చేస్తూ ఒక్క రూపాయి ఫీజుతో పేదలకు అన్ని రకాల వైద్యం అందిస్తున్నామన్నారు. ఈ వైద్య శిబిరంలో సుమారు 500 మంది రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. ఒక్క రూపాయి హాస్పిటల్ రూపకర్త జీజీ చారిటీ ఫౌండర్ గంగాధర్ గుప్త, రమేశ్, పెండ్యాల రవి, సుదర్శన్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.