టెట్‌‌తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇయ్యాలే : గాదే నర్సింగరావు

టెట్‌‌తో సంబంధం లేకుండా ప్రమోషన్లు ఇయ్యాలే : గాదే నర్సింగరావు

మెట్ పల్లి, వెలుగు: టెట్‌‌తో సంబంధం లేకుండా టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వాలని  పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు గాదే నర్సింగరావు ప్రభుత్వాన్ని డిమాండ్​ చేశారు. మంగళవారం మెట్‌‌పల్లి పట్టణంలో పీఆర్టీయూ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ పీఆర్టీయూ ఆవిర్భావం నుంచి టీచర్ల సమస్యల కోసం పోరాడుతోందన్నారు. కార్యక్రమంలో మోడల్ స్కూల్ రాష్ట్ర ప్రతినిధి రాజు జాదవ్, సభ్యులు రాష్ట్ర, జిల్లా, మండల నాయకులు డాక్టర్ ముత్యపు నాగన్న, మహేశ్‌‌ కుమార్, యాదగిరి, సంతోష్, వేణు, రాజేంద్ర ప్రసాద్, సురేశ్, రాజ్ జాదవ్ పాల్గొన్నారు.