చండీగఢ్: పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో భదౌర్, చామ్కౌర్ సాహిబ్ అసెంబ్లీ స్థానాల నుంచి చన్నీ పోటీకి దిగారు. ఈ రెండు చోట్ల ఆమ్ ఆద్మీ అభ్యర్థులే విజయం సాధించారు. భదౌర్లో ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ ఉగోకే 37,558 మెజారిటీతో చన్నీపై గెలిచారు. చామ్కౌర్ సాహిబ్లో మరో ఆప్ క్యాండిడేట్ చరణ్జిత్ సింగ్ 7,942 స్వల్ప అధిక్యంతో చన్నీపై విజయం సాధించారు.
స్వీపర్ కొడుకు ఊడ్చేశాడు..
పంజాబ్లో భదౌర్ స్థానం నుంచి సీఎం చరణ్సింగ్ చన్నీపై గెలిచిన ఆప్ అభ్యర్థి లాభ్ సింగ్ ఓ స్వీపర్ కొడుకు. అతని తండ్రి ఓ డ్రైవర్. తల్లి స్వీపర్గా పనిచేస్తోంది. లాభ్సింగ్ మొబైల్ షాపులో పనిచేసేవారు. డాక్టర్ ఆపరేషన్ సక్సెస్
మరో స్థానం చామ్కౌర్ సాహిబ్ నుంచి పోటీ చేసిన చన్నీ.. ఆప్ అభ్యర్థి చరణ్జిత్ సింగ్ చేతిలో ఓడిపోయారు. ప్రజల తీర్పును గౌరవిస్తున్నానని, పంజాబ్లో గెలిచిన ఆప్కు, భగవంత్ మన్కు అభినందనలని చన్నీ ట్వీట్ చేశారు.