
అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరగనున్న క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు వర్షం అంతరాయం కొనసాగుతోంది. ఆదివారం (జూన్ 1) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ప్రారంభమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్ వర్షం కారణంగా 9:30 నిమిషాలు అయినా మ్యాచ్ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో మ్యాచ్ రద్దయ్యే అవకాశలు కనిపిస్తున్నాయి. మరోవైపు అహ్మదాబాద్ లో డ్రైనేజ్ సిస్టం బాగుండడంతో మ్యాచ్ జరిగే అవకాశాలను కొట్టిపారేయలేం. వస్తున్న సమాచార ప్రకారం 9:30 నిమిషాలకు వర్షం తగ్గింది.
ఒకవేళ 9:40 గంటలకు మ్యాచ్ ప్రారంభం కాకపోతే ఓవర్లను కుదించి మ్యాచ్ నిర్వహిస్తారు. నిర్ణీత సమయం కంటే రెండు గంటలపాటు అదనంగా మ్యాచ్ జరిపేందుకు ఛాన్స్ ఉంది. దీంతో ఫ్యాన్స్ కు ఇంకా మ్యాచ్ పై ఆశలు పెట్టుకున్నారు. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే ముంబైకి నష్టం జరగనుంది. వర్షం నిలకడగా పడుతుండడంతో మ్యాచ్ రద్దు అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే జరిగితే పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 ఫైనల్ కు చేరుకుంటుంది. ఎందుకంటే క్వాలిఫయర్ 2 కు రిజర్వ్ డే లేదు. రూల్స్ ప్రకారం పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉన్న జట్టు ఫైనల్ కు అర్హత సాధిస్తుంది.
ఈ సీజన్ లో పంజాబ్ 19 పాయింట్లతో టేబుల్ లో అగ్ర స్థానంలో నిలిచింది. మరోవైపు ముంబై 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో నిలిచింది. లీగ్ దశలో టాపర్గా నిలిచినప్పటికీ ఆర్సీబీ చేతిలో 8 వికెట్ల తేడాతో ఓటమి శ్రేయస్ అయ్యర్ సేనలో ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. తొలి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడాలనే కలతో ఉన్న కింగ్స్కు ఇది చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్. మరోవైపు, ఎలిమినేటర్లో టైటిల్ ఫేవరెట్ గుజరాత్ టైటాన్స్ను ఓడించిన ముంబై ఇండియన్స్ ఫుల్ జోష్తో ఆరో టైటిల్ దిశగా మరో అడుగు వేసింది.