MI vs PBKS Qualifier 2: ముంబైకి టెన్షన్, టెన్షన్.. క్వాలిఫయర్ 2కు వర్షం అంతరాయం

MI vs PBKS Qualifier 2: ముంబైకి టెన్షన్, టెన్షన్.. క్వాలిఫయర్ 2కు వర్షం అంతరాయం

ఐపీఎల్ 2025లో ఆదివారం (జూన్ 1) ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య ప్రారంభమైన క్వాలిఫయర్ 2 మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. అహ్మదాబాద్ వేదికగా నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్.. టాస్ కు 5 నిమిషాల ముందు వర్షం ప్రారంభమైంది. వర్షం పెద్దది కావడంతో ఆటగాళ్ళు డగౌట్ నుంచి డ్రెస్సింగ్ రూమ్‌లకు వెళ్లిపోయారు. తీవ్రమైన గాలులు వీచడంతో ఆటగాళ్లు డగౌట్ లోనే ఉండిపోయారు. పిచ్ మీద కవర్లు కప్పి ఉంచారు. 

వర్షం పడుతుండడంతో ముంబై జట్టులో టెన్షన్ స్టార్ట్ అయింది. ఈ మ్యాచ్ ఒకవేళ వర్షం కారణంగా రద్దయితే పాయింట్ల పట్టికలో టాప్ లో ఉన్న పంజాబ్ ఫైనల్ కు అర్హత సాధిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ కు రిజర్వ్ డే లేదు. దీంతో మ్యాచ్ జరగడానికి వీలు లేకపోతే పంజాబ్ ఫైనల్ కు వెళ్తుంది.  ఈ మ్యాచ్ లో పంజాబ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముంబై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ కు వెళ్తుంది. 

పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):

ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, మార్కస్ స్టోయినిస్, శశాంక్ సింగ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, కైల్ జామీసన్, విజయ్‌కుమార్ వైషాక్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): 

రోహిత్ శర్మ, జానీ బెయిర్‌స్టో (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, రాజ్ బావా, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా, రీస్ టాప్లీ