
ఐపీఎల్ 2025లో సోమవారం (మే 26) సూపర్ ఫైట్ కు రంగం సిద్ధమైంది. ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ క్వాలిఫయర్ 1 బెర్త్ కోసం అమీతుమీ తేల్చుకోనున్నాయి. జైపూర్ లోని జైపూర్ లోని సవాయ్ మాన్సింగ్ స్టేడియంలో ప్రారంభమైన ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతున్న ఇరు జట్లు ఈ మ్యాచ్ లో గెలిచి క్వాలిఫయర్ 1 ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. ప్లేయింగ్ 11 లో ముంబై ఇండియన్స్ ఒక మార్పు చేసింది. తుది జట్టులో ఫాస్ట్ బౌలర్ అశ్వనిని తీసుకొచ్చింది. మరోవైపు పంజాబ్ తుది జట్టులో ఫాస్ట్ బౌలర్లు జెమీసన్, వైశుక్ వచ్చారు.
పంజాబ్ కింగ్స్ (ప్లేయింగ్ XI):
ప్రియాంష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నెహాల్ వధేరా, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో జాన్సెన్, హర్ప్రీత్ బ్రార్, కైల్ జామీసన్, విజయ్కుమార్ వైషాక్, అర్ష్దీప్ సింగ్
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI):
ర్యాన్ రికెల్టన్ (వికెట్ కీపర్), రోహిత్ శర్మ, విల్ జాక్స్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా (కెప్టెన్), నమన్ ధీర్, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, ట్రెంట్ బౌల్ట్, జస్ప్రీత్ బుమ్రా