కాంగ్రెస్ను వీడి బీజేపీలో చేరిన వారం రోజులకే పంజాబ్ ఎమ్యెల్యే బల్వీందర్ సింగ్ లడ్డీ..తిరిగి మళ్లీ సొంతగూటికి చేరుకున్నారు. AICC పంజాబ్ వ్యవహారాల ఇన్చార్జ్ హరీష్ చౌదరి, సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ సమక్షంలో ఆదివారం రాత్రి తాను కాంగ్రెస్లో మళ్లీ చేరానని ఇవాళ(సోమవారం) లడ్డీ తెలిపారు. శ్రీ హర్గోబింద్పూర్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న లడ్డీ మరో ఎమ్మెల్యే ఫతేజంగ్ సింగ్ హజ్వాతో కలసి డిసెంబర్ 28న ఢిల్లీలో బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి, పంజాబ్ బీజేపీ వ్యవహారాల ఇన్చార్జ్ గజేంద్ర సింగ్ షెకావత్ సమక్షంలో వారిద్దరూ బీజేపీలో చేరారు.
మరిన్ని వార్తల కోసం..