రామ్, పూరి క్రేజీ కాంబో.. మే 14న దిమాఖ్ ఖరాబ్ అనౌన్స్మెంట్

రామ్, పూరి క్రేజీ కాంబో.. మే 14న దిమాఖ్ ఖరాబ్ అనౌన్స్మెంట్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ క్రేజీ అప్డేట్ ఇచ్చాడు. అయన దర్శకత్వంలో రామ్ పోతినేని హీరోగా వచ్చిన ఇస్మార్ట్ శంకర్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరంలేదు. ఈ ఒక్క సినిమాతో అటు పూరి జగన్నాధ్, ఇటు రామ్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారు. పక్క మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏకంగా వంద కోట్లు కొల్లగొట్టింది.

ఇక దాదాపు నాలుగేళ్ల తరువాత ఈ సినిమాకి సీక్వెల్ ప్రకటించాడు డైరెక్టర్ పూరి జగన్నాధ్. తాజాగా ఇందుకు సంబంధించిన అఫీషియల్  అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసాడు. ఇందులో భాగంగా పూరి తన ట్విట్టర్ లో అనౌన్స్మెంట్ వీడియో కూడా రిలీజ్ చేశారడు. ఈ క్రేజీ కాంబో కి సంబంధించిన దిమాఖ్ ఖరాబ్ అప్డేట్ మే 14న సాయంత్రం 4 గంటలకి రానుందని ఈ వీడియోలో ప్రకటించాడు. నిజానికి ఈ సీక్వెల్ కోసం ఆడియన్స్ కూడా చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.

ఈ లేటెస్ట్ అప్డేట్ తో ఫుల్ ఖుషీ అవుతున్నారు రామ్ ఫ్యాన్స్. పూరి కనెక్ట్స్ పై పూరి జగన్నాధ్, చార్మీ నిర్మిస్తున్న ఈ సినిమాకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ త్వరలోనే వెల్లడించనున్నారు మేకర్స్. ఇక రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్ గా రానున్న ఈ మూవీ ఇంకెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.