న్యూఢిల్లీ: ఇండియా డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధు.. సీజన్ ఎండింగ్ టోర్నీ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ నుంచి తప్పుకుంది. ఎడమ మోకాలి గాయం నుంచి పూర్తి స్థాయిలో కోలుకోకపోవడంతో ఆమె ఈ నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 14న చైనాలోని గాంగ్జూలో వరల్డ్ ఫైనల్స్ జరుగుతాయి. ‘డాక్టర్లు మరికొంత రెస్ట్ అవసరమని చెప్పారు. పూర్తి ఫిట్నెస్తో కొత్త సీజన్ను మొదలుపెట్టాలని సింధు భావిస్తోంది.
అలాగే తన ఇబ్బందుల గురించి కూడా ఆలోచిస్తున్నది. గాంగ్జూలో రిస్ట్రిక్షన్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని టోర్నీ నుంచి తప్పుకుంది’ అని సింధు తండ్రి పీవీ రమణ వెల్లడించారు. రెండు వారాల కిందటే ట్రెయినింగ్ మొదలుపెట్టిన సింధు.. జనవరి కల్లా పూర్తి ఫిట్నెస్ సాధించే అవకాశం ఉంది.