
జకర్తా: ఇండియా స్టార్ షట్లర్ పీవీ సింధు.. ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీలో నిరాశపర్చింది. గురువారం జరిగిన విమెన్స్ సింగిల్స్ రెండో రౌండ్లో సింధు 22–20, 10–21, 18–21తో వరల్డ్ ఎనిమిదో ర్యాంకర్ పోర్న్పావీ చొచువాంగ్ (థాయ్లాండ్) చేతిలో ఓడింది. 78 నిమిషాల మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్లు చెరో గేమ్ గెలిచారు. అయితే డిసైడర్లో 15–11 లీడ్లో ఉన్న దశలో సింధు అనూహ్యంగా వెనకబడింది.
మెన్స్ డబుల్స్లో సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టి 16–21, 21–18, 22–20తో రాస్మస్ కాజెర్–ఫ్రెడరిక్ సోగార్డ్ (డెన్మార్క్)పై నెగ్గి క్వార్టర్ఫైనల్లోకి అడుగుపెట్టారు. విమెన్స్ డబుల్స్లో ట్రీసా జోలీ–గాయత్రి గోపీచంద్ 13–21, 22–24తో యుకీ ఫుక్సుషిమా–మయ మట్సుమోటో (జపాన్) చేతిలో కంగుతిన్నారు.